
కరోనా ..కరోనా .. చాలా మంది లైట్ తీసుకుంటున్నారు . కరోనా వస్తే ఏమౌతుందిలే.. ఇప్పటికే రెండు సార్లు చూశాం అంటున్నారు. పరిస్థితి అంత ఈజీగా .. లైట్ తీసుకునే విధంగా ఏమి లేదని .. దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు స్పష్టం చేస్తున్నారు .2025, జూన్ 5వ తేదీ నాటికి దేశంలో 5 వేల కేసులు నమోదు అయితే .. అందులో వెయ్యి 200 వందల కేసులు .. జూన్ 4వ తేదీ ఒక్క రోజే నమోదు అయ్యాయి. ఈ డేటా అంతా ఇలా ఉంటే .. ఏపీ రాష్టము విశాఖపట్నంలో నమోదైన కరోనా కేసు కలకలం రేపుతోంది.

విశాఖ లో omicron కలకలం
విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికకు కరోనా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వైరస్ ఎటాక్ కావటం.. ఇప్పటికే మూడు కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది. ప్రజల అప్రమత్తంగా ఉండాలని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని .. జలుబు, దగ్గు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు విశాఖపటం డాక్టర్లు. కరోనా అనుమానం ఉంటే వెంటేనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని .. ఇంట్లో ఉంటే ట్యాబ్లెట్లు తీసుకోవద్దని .. మెడికల్ షాపు వాళ్ళు ఇచ్చే మందులతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో అశ్రద్ద వహించొద్దని హెచ్చరిస్తున్నారు వైజాగ్ డాక్టర్లు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి