తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్ లకు పరిమితమైన ప్రీ ప్రైమరీ తరగతులను సర్కార్ బడుల్లో (Telangana Govt Schools) ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 11 న ఉత్తర్వులను విడుదల చేసింది సమగ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రం లోని 210 ప్రభుత్వ స్కూల్ లలో నర్సరీ LKG, UKG తరగతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana Govt School లో విప్లవం
ఈ విద్య సంవత్సరం నుండే ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ (Telangana Govt Schools) లలో నర్సరీ LKG, UKG తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. ఇది వరకు ప్రభుత్వ స్కూల్ లలో ప్రీ ప్రైమరీ లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే దిక్కయ్యాయి, ఈ ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మంది పేద విద్యార్థులకు తల్లి దండ్రులకు ఊరట కలిగించే విషయమే.
for More Education News Please Click Here