
సాధ్యమైనంత త్వరగా 4 ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు రైతుభరోసా డబ్బులను వారి ఖాతాల్లో వేసి మిగతా 4 ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు జూన్ రెండు , మూడో వారంలోగా వేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూన్ చివరి వారం నుండి వరుసగా సర్పంచ్ , ఎంపీటీసీ. జెడ్పీటీసీ , మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి. నోటిఫికేషన్ విడుదల చేసి జులై చివరి వారం నుండి ఆగష్టు మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తిచేసేందుకు పార్టీ శ్రేణులను సన్నద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.